3.30.2011

జయహో టీం ఇండియా.

download go india go icc cricket world cup song mp3s


ఉపఖండంలో మొదటిసారి ఫైనల్ కి చేరిన భారత్..
పాకిస్తాన్ షాక్...................................మన ఇండియా రాక్...

3.29.2011

ఆ ఎక్కువేమిటో .. ఈ తక్కువేమిటో..


మంచి పాట.. మీకొసం

నేడే ఈనాడే...

భారత ఉపఖండంలో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్‌ టోర్నీ అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఈరోజు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌ తర్వాత ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలివుంటుంది. అయితే, ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు పాక్ నుంచి భారీ సంఖ్యలో ప్రేక్షకులు మొహాలీకి తరలివస్తున్నారు. పంజాబ్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు చెందిన అభిమానులు క్యూ కడుతున్నారు. వీరికి ఆతిథ్యం ఇచ్చేందుకు అవసరమైన హోటల్స్, అతిథి గృహాలు లేవు. దీంతో పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు వచ్చి పాక్ అభిమానులకు తమ ఇళ్ళలో అతిథ్యం ఇస్తామంటూ ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.

ఆ తర్వాత మొహాలీ ప్రజలు కూడా ముందుకు వచ్చి ఒక్కో ఇంటిలో ఒక్కొక్కరికి ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం మొహాలీ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. పాక్ అభిమానులకు ఆతిథ్యం ఇవ్వదలచుకున్న వారు తమ పేర్లు, చిరునామాలను నమోదు చేసుకోవాలని సూచించారు. 

భారత ఉపఖండంలో జరుగనున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా గెలుపును టాస్ మరియు బ్యాటింగ్ ఫామ్ వంటి అంశాలే నిర్ధేశిస్తాయని భారత్‌కు 1983లో వన్డే ప్రపంచకప్ సాధించిపెట్టిన మాజీ క్రికెట్ లెజండ్, కెప్టెన్ కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు.

"మనదేశ క్రికెట్ జట్టుకు బ్యాటింగే బలం. ఈ బ్యాటింగ్‌కు ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం తోడుకావాలి. అలాగే అదృష్టం కూడా ఒకవైపు ఉంది. ఎలాగంటే ప్రతి మ్యాచ్‌లోనూ టాస్ గెలవడం ముఖ్యం. ప్రత్యర్థి జట్టు టాస్ గెలిచి భారీ స్కోరు సాధిస్తే, విజయలక్ష్యాన్ని చేధించడం కఠినమవుతుంది" అని కపిల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

కానీ మన జట్టు టాస్ గెలిచి 300 పరుగుల పైచిలుకు సాధిస్తే బౌలర్లు మ్యాచ్‌ను గెలిపిస్తారని కపిల్ దేవ్ తెలిపాడు. ఇంకా ఆల్‌రౌండర్లు అంటూ ప్రత్యేకంగా అవసరం లేదు. ధోనీ కూడా ఒక వికెట్ కీపింగ్ ఆల్‌రౌండరేనని కపిల్ అన్నాడు.

ధోనీ తన సమర్థవంతమైన కెప్టెన్సీతో అద్భుతంగా ఆడి, వన్డే ప్రపంచకప్‌ను సాధించిపెడుతాడని ఆశిస్తున్నట్లు కపిల్ తెలిపాడు. టీమిండియాలో కప్‌ను సాధించిపెట్టే ఆటగాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఫీల్డింగ్, స్కోర్ చేయడంలో కొన్ని బలహీనతలు ఉన్నాయని కపిల్ తెలిపాడు.

వెబ్ దునియా సౌజన్యంతో ..


 

ఆధార్ గురించి..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన,  దేశమంతటా చెల్లుబాటు అయ్యేలా రూపొందించిన ఆధార్ కార్డులను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి.  ఆధార్ కార్డ్ సామాన్య మానవుడి జన్మ హక్కు.    ఆధార్ వల్ల భవిష్యత్తులో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, తమ వద్ద ఎటువంటి గుర్తింపు, ధృవీకరణ కార్డు లేనివారికి ఇది మరింతగా ఉపకరిస్తుంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు సైతం ఈ కార్డు పొందొచ్చు . పూర్తి ఉచితంగా లభించే ఈ కార్డు ద్వారా వివిధ సౌకర్యాలను పొందడం సులభం అవుతుంది.    ప్రతి వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారంతో ఉండే ఈ కార్డు పొందడానికి సంబంధిత  క్యాంపు వద్ద ఇచ్చే ఫారం పూర్తి చేసి ఏదైనా ఒక గుర్తింపు కార్డు తమ వెంట తీసుకువెళ్ళాలి.  


ప్పుడు మీరు ఆధార్ సంఖ్యతో బ్యాంకు ఖాతా తెరవవచ్చు.
భారతదేశ  విశిష్ట గుర్తింపు జారీ  సంస్థ ( యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా-UIDAI) చే జారీ చేయబడిన ఆధార్ సంఖ్యను  కేంద్ర ఆర్ధిక  మంత్రిత్వ శాఖ గుర్తించింది. “ బ్యాంకు ఖాతాలు తెరవడానికి మీ ఖాతా దారు గురించి తెలుసుకో –  కె వై సి నిబంధనలకు అనుగుణంగా ఈ ఆధార్ సంఖ్యలు అధికారికంగా అమలుచేయడానికి గుర్తిస్తారని భారతదేశ  విశిష్ట గుర్తింపు జారీ  సంస్థ (యు ఐ డి ఎ ఐ)  విడుదల చేసిన ప్రకటనలో తెల్పింది. పేదవారికి మరియు బ్యాంకింగ్ సౌకర్యం అందుబాటులో లేని జనాభాకు ఈ సంఖ్య అమలు చేయడం వలన వారి గుర్తింపు సులభతరమై వారిని ఆర్ధిక రంగంలో చేర్చడానికి ఈ సంఖ్య   సత్వర వీలు కల్పిస్తుంది.
ఆధార్ సంఖ్య కోసం నమోదు చేసుకునే సమయంలోనే తమ భాగ స్వామ్య బ్యాంకులతో ఆధార్ సంఖ్యను కె వై సి నిబంధనలను సంతృప్తి పరచే విధంగా ఆమోదింప చేయడం వలన పౌరులు బ్యాంకు ఖాతాలు తెరుచుకునే వీలు కల్పించి ఖాతాలు తెరచే ప్రక్రియను యు ఐ డి ఎ ఐ సులభతరం చేస్తుంది” . “ బ్యాంకులకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని యు ఐ డి సంఖ్యలు అందిస్తాయి. ఈ సంఖ్య బ్యాంకులో కొత్తఖాతాలు తెరచుకోవడానికి మరియు ఆర్ధిక తోడ్పాటుకు ఖచ్చితమైన సహాయం అందిస్తుందని ,” ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మాజీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ హెచ్.  రత్నాకర్ హెగ్డే అన్నారు.

 

 



దేశంలో 6,00, 000 జనావాసాలు ఉండగా అందులో 100 లేక అంతకంటే ఎక్కువ మంది జనాభా ఉన్న ప్రాంతాలు  30,000 లలో మాత్రమే  వాణిజ్య బ్యాంకు శాఖలు ఉన్నాయి. భారతీయ రిజర్వు బ్యాంకు అందించిన వివరాల ప్రకారం దేశలోని మొత్తం జనాభాలో సగం కంటే తక్కువ జనాభాకు మాత్రమే బ్యాంకు ఖాతాలు  ఉన్నాయి.  కొన్ని బ్యాంకుల్లో   కె వై సి నిబంధనలకనుగుణంగా యు ఐ డి సంఖ్యలను ఉపయోగించడం ఇప్పటికే ప్రవేశపెట్టినట్టు ప్రభుత్వ సమాచారం. బ్యాంకు ఖాతా తెరవడానికి ఉపయోగించే కొత్త దరఖాస్తు ఫారాలలో యూనిక్ సంఖ్య కోసం ఒక ప్రత్యేక గడి ఇవ్వబడింది. 12 అంకెలతో కూడిన గుర్తింపు సంఖ్య, ఆధార్ ను ప్రభుత్వం పౌరుల యొక్క విశిష్ట గుర్తింపు కోసం జారీ చేస్తోంది. ఈ సంఖ్య పౌరుని నివాసం మరియు అతని గుర్తింపు కోసం అవసరమైన వేలి ముద్రలు, పుట్టుమచ్చలు, ఫొటోలు మొదలైన భౌతిక అంశాలతో కూడిన పూర్తి సమాచారం అందిస్తుంది. పౌరులు దేశ వ్యాప్తంగా ఈ సంఖ్యను ఏ ప్రాంతంలో ఉన్నను వాడుకోవచ్చు.  ఈ సంఖ్య వల్ల పౌరులు వారికి రావలసిన ప్రయోజనాలు, కావలసిన సేవలు పొందవచ్చు.
కె వై సి నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు బ్యాంకులు గుర్తింపు పత్రాలుగా పాస్ పోర్ట్ , డ్రైవింగ్ లైసెన్స్ ,మరియు  ఓటరు గుర్తింపు కార్డులను  కోరుతున్నాయి. ఈ పత్రాలు ఖాతా తెరిచే వ్యక్తి గుర్తింపును మరియు అతని చిరునామా వివరాలను ధృవపరుస్తాయి.

 


ఆర్ధిక రంగంలో చేర్చేందుకు కె వై సి నిబంధనల ప్రక్రియలో ఈ గుర్తింపు అంశం అతి పెద్దదైన అడ్డంకిగా మారడంతో ఆ గుర్తింపుకు ఆమోదం తెల్పేలా ఈ యు ఐ డీ సంఖ్య పనికి వస్తుందని యు ఐ డి ఎ ఐ చైర్మన్ శ్రీ నందన్ నిలేకని అన్నారు. “12 అంకెలు కల్గిన యు ఐ డి సంఖ్య ఖచ్చితమైన మరియు సూక్ష్మమైన ఎ టి ఎమ్ గా పని చేయక పోతే ఈ ప్రాజెక్ట్( పథకం) ను కొనసాగించడంలో అర్ధంలేదని”  ఆయన అన్నారు. “ఆర్ధిక రంగంలో చేరికకు వ్యక్తిగత వివరాలు పెద్ద అడ్డంకిగా మారడంతో కె వై సి నిబంధనల కనుగుణంగా ఈ యు ఐ డి సంఖ్య రూపొందించామని ఆయన అన్నారు. ప్రస్తుతం  పట్టణం లేదా గ్రామాలలోని పేదలకు ఈ కె వై సి నిబంధనలు పెద్ద అడ్డంకిగా ఉన్నాయని”  నిలేకని అన్నారు.

మూలం: ది ఎకనామిక్ టైమ్స్


చిత్ర మాలికలో ఈ పాట చూశారా/విన్నారా?

అనురాగాలు, అభిమానాలు, కోపాలు, తాపాలు.. మనిషికి సహజం. లోపాలు ఎంచనిదే సుఖసంసారం.  తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో అన్నట్లుగా.. మన చిన్న  సంసారంలో ఇలాంటి సరాగాలు, భర్త కోరికలు,, బార్య చెణుకులు.. కోపాలు .. బుజ్జగింపులు మేళవించిన ఈ పాట అన్ని తరాల ఆ పాత మధురం.. ఒకసారి అటు వెళ్ళి పాట వినేసి రండి.. అవునంటారా? కాదంటారా? ఏమంటారు మీరేమంటారో చెప్పండి.. ;-)

3.28.2011

కొంచం మార్పు కోసం..

"లింగాష్టకం కూడా బాగుంటుంది. శివరాత్రిరోజు మా కుటుంబ సభ్యులందరం ఫిల్మ్ నగర్లో ఉన్న శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించాము..." 

వనితామాలికలో మహాశివరాత్రి ప్రత్యేక వ్యాసానికి నేను రాసిన కమెంట్ ఇది. ముందు మోడరేషన్‌లో ఉంది.. పబ్లిష్ అయి,  చూసిన తరువాత ఎందుకో నా కమెంట్ తొందరపాటులో ఇంకెవరిదోలా అనిపించింది. అలా ఎలా నేను రాసిందేనా? అని మళ్ళీ చూసుకున్నా.. కాసేపు నవ్వుకున్నా.. చూడగానే మీకు అనిపించిందా? అనిపిస్తే సరదాగా నవ్వేసుకుకొండి... ఎవరో చెప్పడం ఎందుకో....ఆహ్లాదంగా ఉన్న వాతావరణాన్ని మార్చడం ఇష్టం లేదు... తెలిస్తే మీరే నవ్వేసుకుంటారు.. ;-)
*****

దేవుడు మన జీవితంలో ఎంతవరకు?

ramani
"మనమీద నమ్మకమే మనల్ని నిలబెట్టేది. ఈ సంపాదకీయం నన్నో పోస్ట్ రాసేలా ఉసిగొల్పుతోంది."
*****
ఇక్కడ నేను దైవ దూషణ చయడంలేదు.. పెద్దలు విజ్ఞులు గమనిచవలెను.. నా బుఱ్ఱలో చిక్కుకుని ఉన్న అనేకానేక ప్రశ్నలకి,  సమాధానాలు దొరకక..ఇక ఆలోచించడం మానేసి... పోస్ట్ రాస్తున్నాను. 

ప్రతి యుగంలో.. ఎవరో ఒక దేవుడు అవతరించి, గోవర్థన గిరి ఎత్తడమో లేకపోతే మసీదుని పుర ప్రజలకి గూడు లా ఇచ్చి వారిని కాపాడడమో చదువుతూనే ఉన్నాము. మరి ఈ యుగంలో దేవుడేడి? ఎక్కడ? గుజరాత్ భూకంపాలని, శ్రీలంక , జపాను సునామిలని ఆపడానికి ఏ గోవర్థన పర్వాతాలు, ఏ మసీదులు ఆసరాగా ఇవ్వడం చూడలేదు.. జరిగాయి అన్నవి పురాణాల్లోనా.. మన కంటి ముందు జరగవా.. కొన్నాళ్ళ కింద కొన్నేళ్ళ కిందట నాలో ఉదయించే ప్రశ్నలు..

ఎక్కడో జరుగుతున్నాయని, జరిగాయని విన్నాను కొన్నయితే కళ్ళారా కూడా చూశాను. సరే.. వీటి ఆంతర్యం? కింకర్తవ్యం?? అనే ప్రశ్నలు మళ్ళీ.. జవాబు లేని ప్రశ్నలు.. జవాబు వెతుక్కోవాల్సిన ప్రశ్నలు.

ఏమి జరిగాయి ఎక్కడ జరిగాయి అన్నది కాదు ఇక్కడ ప్రశ్న.. అసలు దేవుడు మన జీవితంలో ఎంతవరకు? అంటే.. కడదాకా అంటారు.. ఆ తరువాత కూడా ఆయనే కాపాడాలి అంటారు.. సరే.. మన కోరిక దేవుడు మన వెన్నంటి కడదాకా ఇంకో మానవ జన్మ అనేది లేకుండా మనల్ని కాపాడుతూ ఉండాలి.. మనకి ముక్తిని ప్రసాదించాలి. ఆధ్యాత్మికతతో ఉన్నవాళ్ళ కోరిక ఇది. 

అధ్యాత్మికత ఎలా రావాలి? ఎప్పుడు రావాలి? ఎందుకు రావాలి.. పసి పిల్లలుగా ఉన్నప్పటినుండి అమ్మ చేసే పూజలో చుట్టు జరిగే భజనలో వ్రతాలో మనల్ని ఎవరో ఒక అదృశ్యమైన వ్యక్తి కాపాడుతూ ఉంటాడు అని మనకి తెలియకుండానే "దేవుడు" అనేమాటకి కమిట్ అయిపోతాము. ఒకవిధంగా చెప్పాలంటే ఆయన ఒక "ఆపధ్బాంధవుడు" మాత్రమే .. మనకేదన్నా కావల్సివస్తే మటుకు (అప్పటికి మనం సంపాదించము కాబట్టి ) అమ్మా నాన్నలని అడగాల్సిందే.. మరి వాళ్ళెందుకు దేవుళ్ళు కాలేకపోయారు? మనకి తెలియని వయసు నుండి తెలిసే వయసు దాకా ఆలన పాలన చూసి మనల్ని ఇంతవాళ్ళని చేసిన వాళ్ళు వృద్ధులు, ముసలివాళ్ళు.. కాని అప్పటినుండి మనకి కనపడకుండా ఉన్న అదృశ్య వ్యక్తి మనకి దేవుడు.. :-)  ఎలా? ఏవిధంగా? విచిత్రంగా వాళ్ళు కూడా తమకి జన్మని ఇచ్చిన వారిని కాకుండా.. దేవుడినే ప్రార్థిస్తూ ఉంటారు లెండి అది వేరే విషయం.  

అసలు ఆధ్యాత్మికత అనేది ఎలా ఆచరించాలి? ఏ వయసులో ఆచరించాలి? పూర్తిగా నీ సేవలోనే భగవంతుడా అని అనుకున్నప్పుడు అసలు మనకీ మానవ జన్మ ఎందుకిచ్చాడు ఆ భగవంతుడు.. ఎందుకీ సంసారం? పిల్లలు, బాధ్యతలు.. నా జీవిత పరమావధి ఆధ్యాత్మిక జీవితం అయినప్పుడు నన్ను ఈ సంసార చక్రంలోకి లాగ కూడదు.. నిండా మునిగినవాడికి చలి ఉండదని సందేశమా?? మరి అలాంటప్పుడు పూర్తిగా మునగనివ్వాలి.. కాదు నువ్వు తేలిపో అనే ఆధ్యాత్మికత ఏంటి?? 

నా పిల్లలు ఇప్పటినుండే భగవంతుడి మార్గంలో ఉన్నారు.. వాళ్ళకి రేపు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చాలా మంది.. పెద్దవాళ్ళ ఉవాచ...ఉదాహరణకి.. నా పిల్లలినే తీసుకుందాము.. వాళ్ళకి "దేవుడు అనే ఒక మనిషి తమని అదృశ్యంగా కాపాడుతూ ఉన్నాడని తెలుసు.." ఆ జ్ఞానం వాళ్ళు చూపించే విధానం .. తినే మొదటి ముద్ద సర్వం "భగవధర్పితమస్తూ" అనుకుంటారు.. లేదా పరీక్షలు దగ్గర పడ్తున్నాయంటే "మేము బాగా రాసేలా దీవించు భగవంతుడా" అని దేవుడిని వేడుకుంటారు. అంటే దీని అర్థం "మేమేమి చదవము.. కాని నువ్వొచ్చి మా చేయి పట్టుకుని రాయించేయి"  అని కాదు కదా.. చదువుతారు.. కాని మర్చిపోతామేమో అని భయం.. వాళ్ళ పరిజ్ఞానం మీద అపనమ్మకం.. దేవుడిమీద విపరీతమైన నమ్మకం. ఇంతవరకే వాళ్ళకి తెలుసు. దేవుడు తాము కోరిన కోరిక తీర్చాలి.. అంతే అంతవరకే..

అంతే కాని.. దేవుడిమీద నమ్మకం .. పుస్తకం చదవకుండా ఉదయం మొదలు, సాయంత్రం వరకు ఏ భజనలోనో ఏ వ్రతంలోనో గడిపితే అంతటి ఆధ్యాత్మికత వాళ్ళని పరీక్షలలో ఉత్తీర్ణులని చేస్తుందా? అధ్యాత్మికతతో ఉండడం అంటే ఇదేనా? నా మనసు సదా భగవన్నామస్మరణం చేయడం అంటే ఆధ్యాత్మికత కాదా? 

ప్రాపంచిక విషయాల పట్టింపు లేకుండా సదా అధ్యాత్మికతతో గడపాలంటారు చాలా మంది సాధుపుంగవులు? అప్పుడు మరి ఆకలి దప్పులు ఉండవా? సంసారి కానివాడు అన్నిటికి అతీతుడై ఉండొచ్చు.  కాని ఒక సంసారి ఇలా అకలి దప్పులకి దూరంగా తన పిల్లలిని వదిలేసి ఆధ్యాత్మికతలో ఎలా?

అసలిదంతా కాదండి.. పూజలో వ్రతాలో నిత్యం చేస్తూ, ఇంకేపని చేయకుండా ఉండడం వల్ల నా జీవితం సాఫీగా గడుస్తుందా? మన వృత్తి ధర్మం మనకి ఉంటుంది.. ఆ ధర్మం అధర్మం కాకుండా ఉండడానికో ఆ వృత్తి అభివృద్ధి చెందడానికో, సరే ఇవేమి కాదు ఈ తిప్పలేవో నేను పడతాను నాకు కాస్త పూర్తి ప్రశాంతత ఇవ్వు తండ్రీ అని ఒక దండం ఒక కొబ్బరికాయ కొట్టి మన దైనందిక జీవితంలోకి వెళ్ళాలి అనేది నా అభిప్రాయం. కాదా చెప్పండి??

దేవుడు ప్రత్యక్షమై నీకేమి వరం కావాలో కోరుకో అంటే మనమేమి కోరుకుంటాము? మనసంతా ఆధ్యాత్మికతో నిండేలా చేయి అంటే.. మరి మన భాద్యతలో? మనం రధ సారధులై నడపాల్సిన బండిని వదిలేస్తే ఎలా? నన్ను నీలో ఐక్యం చేసుకో, ముక్తిని ప్రసాదించు ఇవన్నీ  ఇప్పుడు కాదేమో కదా..మనకి ప్రశాంత జీవితం.. పిల్లల ఉన్నత స్థితి నేను కోరుకునేది.. కాని నువ్వు పూర్తిగా మాతో పాటే ఉండిపో అనగలమా? మా ఆతిధ్యం స్వీకరించు అని ?? అలాంటి అథిధి దేవోభవ!  అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకరోజు, రెండురోజులు పోని మూడు రోజులు.. హహహ్హ విసుగు వస్తుంది కదూ ఒక అతిధిని జీవితాంతం మనతో ఉంచుకోడమంటే.. మరి దేవుడిని.. అతిధిగా పిలిస్తే??

ఇవన్నీ చెప్తున్నానంటే నేనేదో నాస్తికురాలిని అనుకునేరు.. నేను పూజలు చేస్తాను. వ్రతాలు నిత్యం ఉంటాయి మా ఇంట్లో.. వీటిల్లో ఒక్క ప్రశ్నకన్నా సమాధానం దొరుకుంతుందన్న ఆశతో.. మళ్ళీ ఆ జవాబులోని ఇంకో ప్రశ్న ఉదయించకూడదు అన్న కోరికతో.

అసలు నాకో చిన్న సందేహం..(మళ్ళీ).. ;-) సాధువులు , సన్యాసులు అంటే సంసారం వదిలేసి.. ఎక్కడో ఏ పర్వతాల్లోనొ ఆకులు అలములు తింటూ తపస్సు చేసుకుంటూ ముక్తికోసం పోరాడుతున్నారు అంటే నో కమెంట్. అది వాళ్ళ జీవిత పరమావధి.. కాని, గొప్పవాళ్ళుగా చలామణీ అవుతున్న రాజర్షులకి..(సంసారం చేస్తూనే ఆధ్యాత్మికత అవలంబించేవారు.. ఎలాగో మరి..) నాకు (మరి నేను కూడ సంసారం చేస్తూనే.. పూజలు అవి చేస్తూ ఉంటా కొండొకచో నిష్ఠగా ఎన్ని సందేహాలుదయించినా పక్కకి పెట్టి మరీ) ఏంటి తేడా? నమ్మట్లేదా.. సరే నన్ను వదిలేద్దాము.. గుళ్ళో పూజారులు.. నిత్యం అలంకరణలతో, అభిషేకాలతో మునిగితేలుతూ ఉంటారు.. మరి వాళ్ళు రాజర్షులెందుకు కాలేకపోయారు? వాళ్ళకి ఊరికే ఏ పురోహితుడో, లేదా పంతులు అన్న పేరు తప్ప.. వాళ్ళెందుకు రాజర్షంత గొప్ప గౌరవం మన్ననలు అందుకోలేకపోతున్నారు? 

ఎన్ని జవాబులేని ప్రశ్నలు.. ఒక్కో జవాబుకి ఇంకో ప్రశ్న ఉదయిస్తూనే ఉంటుంది.. అందుకే సింపుల్ గా నాకు ప్రశాంత జీవితాన్ని ఇవ్వు తండ్రీ అని ఒక్క దండం చాలదు ఆయనకి..

దేవుడిమీద నమ్మకంతో/నమస్కారం పెట్టి , మన మీద మనకి  నమ్మకముంచి జీవిత లక్ష్యాన్ని సాధిస్తే చాలదా జీవితానికి..

ఈ టపా చదువుతున్న పెద్దలు విజ్ఞులు నా అజ్ఞానానికి మన్నించండీ.. ఏ మిడిసిపాటుతోటో రాసింది కాదు ఈ పోస్ట్. నాకు దేవుడంటే భయం భక్తి ఉన్నాయి.. కొందరు ఏసుక్రీస్తుని, మరికొందరు అల్లాని ఇంకొందరు శ్రీ రాముడిని పూజిస్తారు. మరి కొందరే.. రాజర్షులుగా మహర్షులుగా ఉంటున్నారు.. ఆకొందరికే ఈ దేవుడు పరిమితమా? అందరికీ కాదా.. మనకి మోక్షం కావాలన్నా, మన సందేహాలు తీరాలన్నా  దేవుడు మధ్యవర్తుల్లా చలామణి అవుతున్న వీళ్ళదగ్గరికి వెళ్ళాలా? మనం ఎందుకు అందుకోలేకపోతున్నామన్నదే నా ప్రశ్న.. రాస్తూ ఉంటే ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తూనే ఉంటాయి ఇక్కడితో స్వస్తి ఈ పోస్ట్ కి . 
****

వనితామాలిక చదివారా??


కొత్తగా ముస్తాబై వచ్చిన వనితామాలిక చదివారా?? ఈసారి మన ముళ్ళపూడివారికి స్మృత్యంజలి ఘటిస్తూ.. మాయమయిపోతున్న తెలుగు అక్షారలకై లలితగారి ఆవేదన , వెలిబుచ్చిన వ్యధతో ..

శివరాత్రి,  శివపంచాక్షరి ప్రాముఖ్యత వివరిస్తూ..కూరగాయలమ్ముతూ సామాన్య జీవితం గడుపుతూ కోట్లు దానం చేసిన ఒక అసామాన్య మహిళని పరిచయం చేస్తూ.. ఎండల తాకిడికి పిల్లలు పరీక్షలు ఎలా రాస్తారో?  అని తల్లడిల్లే 

తల్లులకు ఉపాయాలు చెప్తూ..వేసవిలో వసంతం కురిపిస్తూ పిల్లలు కాసేపు పుస్తకాలు పక్కన పెట్టి చదవడానికి ఒక  

చందమామ కథని వినిపిస్తూ.. అసలువీటన్నిటికీ పరమార్థం ఏమిటి? ఈ జీవితం ఏమిటి అని అనుకుంటూ జీవిత లక్ష్యాన్ని చేరగలమా అని సంపాదకీయంలో ప్రశ్నిస్తూ.. చేరలేకపోయి.. దుర్భర జీవితం గడిపిన "అడబాప" వనజని పరిచయం చేస్తూ.. లక్ష్యాన్ని  చేరే ముందు కొంత ఎంజాయ్మెంట్ ఉండాలని "ఇండియన్ స్టూడెంట్  డే"  జరుపుకున్న సరికొత్త వనితా మాలిక..

మరి మీరు కూడా వనితా మాలిక తో పాటు ఈ సంబరాలు చేసుకోడానికి ఇదే ఆహ్వానం..:-)

3.27.2011

బజ్జుకి దూరంగా....

బజ్‌లో చెప్పారు కదా మళ్ళీ ఇక్కడెందుకు? అని మీరడగచ్చు. ఎదో నాకు తెలిసింది మీకు చెప్పాలి అని.. మీకు తెలియంది కాదు ..  తెలీదని కూడా కాదు. నాక్కూడా తెలిసిపోయింది  చూశారా అని చెప్పడమన్నమాట. :-)
******
మా స్కూల్ రోజుల్లో ఇంటి దగ్గరే స్కూల్ అవడంవల్ల అమ్మ మధ్యాహ్నం ఇంటికే వచ్చేయమనేది భోజనానికి. మాకేమో అందరిల్లా బాక్సులు తీసుకెళ్ళి అలా కబుర్లు చెప్పుకుంటూ గ్రూప్‌గా తినడం ఇష్టం.. "ఏమి సరిపోతుందే వట్టి కూరముక్కల అన్నం, ఇంటికోస్తే పప్పు, కూర, పచ్చడి అన్నీ తినచ్చు అన్ని రుచులు తెలియాలంటే చక్కగా ఇంటికొచ్చి నాలుగు పధార్థాలు తినడం అలవాటు చేసుకోవాలి. రేపొద్దున్న ఈ బాక్సుల గోల అయితే ఒక పచ్చడితోనో, ఒక పప్పుతోనో సరిపెట్టేసుకుంటారు. ఇంటికొచ్చి పెట్టింది తినండి"  అని గదమాయించేది కాని, పొరపాటున కూడా లంచ్ బాక్స్ అన్న మాట లేదు.... ఆ అనుభవమూ లేదు. ఉస్సూరుమంటూ ఇంటికి రావడం తప్ప.

ఏమాట కా మాట చెప్పుకోవాలి ఇంటికి రాగానే.. వేడి వేడిగా అన్నం, కూరలు పప్పు అంటూ ఎంత ప్రేమగా వడ్డించేదో అంత ఇష్టంగా  తినేవాళ్ళము. ఒక్క ఎమెస్కో వాళ్ళు పుస్తకాల వరద కురిపించేదాక.... అదిగో ఆ పుస్తకాలు నవలలు ఇంటికొచ్చాక తెలిసింది ఆకలి బాధ ఎంటో..  అంతకు ముందు అమ్మ పెట్టిన కూరలు వగైరా గాలికెగిరిపోయాయి.. ఆకలి ముందు అవెంత? మొన్న మొన్నటిదాకా అన్నయ్య, అక్కా,నేను తమ్ముడు కలిసినప్పుడు "అమ్మ అసలు వంట కూడా చేయకుండా ఎలా నవలలు చదివేది కదా" అని.. మా అమ్మ మహా అయితే రెండుసార్లు పోని మూడు సార్లనుకుంటా పుస్తకాలు పట్టుకుని, టైం చూడకుండా వంట మర్చిపోయింది. తరువాత అంటే మేము లంచ్ కని ఇంటికెళ్ళగానే "అయ్యో అప్పుడే 12.30 అయ్యిందే.. చూసుకోలేదమ్మా.." అంటూ అప్పటికప్పుడు తొందరగా అయ్యే టిఫిన్ ఎదో చేసేసి పంపించేది.
******
ఎదో ఒకటిరెండుసార్లు మర్చిపోయినందుకు మొన్నటిదాక చెప్పుకున్నాము, చేసినవన్నీ మర్చిపోయి.. అదే జరగబోయింది (జరుగుతుందేమో కూడా భవిష్యత్తులో) జనవరి, ఫిబ్రవరి దాకా అసలు ఈ బజ్ ఏంటో అంతగా తెలీదు, నాకు తెలియకుండా నన్ను ఫాలో అయ్యేవాళ్ళు లేదా.. నేను ఫాలో అయ్యే బజ్‌లు చదువుతూ కాలక్షేపం చేసేదాన్ని.. నాకు సమయం ఉన్నప్పుడు మాత్రమే.. ఇదిగో ఈ మార్చ్ లో కాస్త బజ్ అంటే ఎంటో తెలిసింది.. ఇంకో నలుగుర్ని ఫాలో అయ్యాను. కాసేపలా కబుర్లు అనుకున్నా.. ఆ కాసేపు కాస్తా రాత్రి 12 అయ్యేది. అమ్మో!  అనుకున్నా  ఒకరోజు, పర్లేదులే రెపిలా చేయకూడదు అనుకున్నా, రెండోరోజు మళ్ళీ టైం చూసుకోలేదు.. సమస్య టైం లో కాదు, పిల్లలు పడుకున్నారులే అనుకుని కబుర్లు చెప్పుకుంటున్న నేను.. ఇద్దరు పడుకున్నారేమో చూద్దామని,  ఇంకో గదిలోకి వెళ్ళేసరికి మా పాప బాబుతో "అమ్మ చాలా మారిపోయింది కదరా.. మనం సెల్ ముట్టుకుంటే తిడుతోంది కాని, తను మటుకు కంప్యూటర్ ముందే కూర్చుంటోంది. మనతో మాట్లాడడం తగ్గించేసింది " అని.. 

విని నేను షాక్.. వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయని. సాధారణంగా వాళ్ళకి నేను దొరకను, అలాంటిది కేవలం బజ్ ల వల్ల నేను ఇలా.. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ ప్రేమ మాటలు, వాళ్ళ ఆటలు నేను చూసేది. రేపొద్దున్న వాళ్ళకంటూ వాళ్ళ జీవితాలు వచ్చాక.. ఇలా మాట్లాడగలరా, హోదా.. గౌరవం.. కుటుంబం అన్నీ చూసుకుంటారు ఉన్న ఈ కాస్త సమయాన్ని బజ్తో కాలక్షేపం చేసేస్తున్నాను. వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఇంక నాకు వేరే పనంటూ ఏముంది.. అప్పుడు ఈ కంప్యూటర్ , ఈ సాంకేతికం ఎక్కడికి వెళ్ళదు.. అదే అనిపించింది.. అందుకే బజ్ కి దూరంగా నా బుజ్జాయిలకి దగ్గరగా ఉందామని నిర్ణయించేసుకున్నా..   

ఈ బజ్ ఒక చాట్ రూం లాంటికి ఒక్కోసారి ఎవరేమి మాట్లాడుకుంటున్నారో అర్థం కాదు. అర్థం చేసుకుని రిప్లై ఇచ్చేసరికి మనకి పుణ్యకాలం కాస్తా పూర్తవుతుంది... ఇంకోటి మొహమాటం.. ఇలా గ్రూప్ చర్చల్లో ముఖ్యమయినది ఏమి లేకపోయినా మనమేమనుకుంటామో అని అవతలి వాళ్ళు, వాళ్ళు హర్ట్ అవుతారేమో అని మనం కాలాయాపన చేస్తూ ఉంటాము మా విషయంలో అదే జరిగింది.. ఎదో పాట గురించి నేను పద్మగారు చర్చించుకుంటూ ఉండగా కుమార్ గారు మౌనంగా వీక్షించారు. చివర్లో మేమిద్దరం పని ఉంది అంటూ బై చెప్పుకున్నప్పుడు.. కుమార్ గారు : "నేను ఇందాకే వెళ్ళాల్సినవాడిని, పని ఉంది కాని మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ "వెళ్తున్నా" కఛ్చితంగా చెప్పలేక ఆగిపోయా" అని అనేసరికి మనసులో చిన్న కదలిక.. ఇలాంటి మొహమాటాలా .. అని.
******
ఇక చివర్లో నా ఆఖరి బజ్ కి వచ్చిన కమెంట్స్ కి రిప్లై ఇవ్వాలనుకుంటున్నా.. బ్లాగు ఇబ్బంది లేదు మనకి కావాల్సినప్పుడు కమెంట్స్ చదుకోవచ్చు రాసుకోవచ్చు.. అందుకని బ్లాగుకి దూరం కాను.. 


పద్మగారు: తగదు తగదంచూ ముందరికాళ్ళకి బంధం వేయకుమా.. ఇద్దరు పిల్లల తల్లిని, పిల్లలకోసం త్యాగం తప్పదు సుమా..
సుధగారు: "అండగా మలక్కు??"  నాకర్థం కాలేదండి ఈ కమెంట్.. ఎవరికో భయపడో బాధపడో బజ్ వదిలేస్తాను అనలేదు. పిల్లలికి దూరమవుతున్నాను. ఇప్పుడే వాళ్ళ ఫీలింగ్స్ పంచుకొనే టైం నాకు. :-)
వేణుగారు: థాంక్స్ అండీ ఇది చదివితే మీరా మాట అనరని నాకు తెలుసు.. :-)
కుమార్ గారు, శ్రావ్య గారు : థాంక్ యూ.. బ్లాగ్ కూడా ఎందుకండి మనకి వచ్చే భావనని పంచుకోడానికో మన తెలుగు మెరుగు పరుచుకోడానికో ఒక డైరి లాగా బ్లాగు రాసుకోడం తప్పు కాదని నా అభిప్రాయం. డైరి అంటే ఎవరు చదవరు.. బ్లాగయితే చదివి అభిప్రాయాలో విమర్శలో వస్తాయి.. తద్వారా మన భాష మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది కదా.. గొడవలు పక్కన పెడితే (ఎప్పుడు పక్కనే పెడ్తాను పెద్దగా పట్టించుకోను ;-) )
సుధ గారు: ఉపయోగపడేవి ఉన్నాయి మాట్లాడుకోవచ్చు చర్చించుకోవచ్చు.. అంతకన్నా  ఉపయోగం .. నేను నా పిల్లల దగ్గర ఉండడం కదండి.. .. 

ఇక పోతే ఈ విషయమై నాకొచ్చిన మెయిల్:

You will say that you will walk out from BUZZ and suddenly we will find you back soon---- Recalling one of your posts about comments in blogs where you have disabled commenting and finally enabled it...... The same thing will happens again as HISTORY REPEATS :) :) :)  So keep buzzing!!!!

చాలా థాంక్స్ అండీ!!!!  మీ అభిమానానికి, నేనెప్పుడు ఏమి చేశానో గుర్తు పెట్టుకున్నందుకు.. బ్లాగులో కమెంట్స్ రాయకుండా నిరోధించినది అప్పట్లో జరిగిన బ్లాగర్ల వ్యక్తిగత దాడులు.. ప్రతీ విషయాన్ని పొడిగించడం ఇష్టం లేక.. నా పరిధిలో నేనుండాలని.. తగ్గిన తరువాత కమెంట్స్‌కి  మళ్ళీ అనుమతి ఇచ్చాను. అది గుర్తుపెట్టుకుని బ్లాగు కి బజ్ కి లంకే పెట్టి .. ఎళ్ళెళ్ళవమ్మా! , నీ సంగతి తెలీదా.. మళ్ళీ ఎలాగు బజ్ ఓపెన్ చేస్తావు" అంటే   .. 

చిరునవ్వే సమాధానం.. థాక్స్ ఫర్ యువర్ అడ్వైస్.  

3.07.2011

పోరాటాల్లో పుట్టిన అంతర్జాతీయ మహిళాది నోత్సవం


* అలెగ్జాండ్రా కొల్లంతారు (1920)

* అలెగ్జాండ్రా కొల్లంతారు (1872-1952) రష్యా విప్లవోద్యమంలో ప్రముఖ నాయకురాలు. ధనిక కుటుంబంలో పుట్టిన ఆమె కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి రష్యా విప్లవంలో చురుకుగా పాల్గొన్నారు. అనేక దేశాల్లో ప్రవాస జీవితం గడిపారు. మంచి వక్త, రచయిత అయిన కొల్లంతారు రష్యాలో మహిళలను సమీకరించ డంలోనూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావంలోనూ కీలక పాత్ర నిర్వహించారు. తొలినాటి మహిళా ఉద్యమం, దాని విప్లవ లక్ష్యాలను వివరిస్తూ 1920లో రాసిన వ్యాసం ఇది:
******

'మహిళా దినోత్సవం' అననీయండి, 'శ్రామిక మహిళా దినోత్సవం' అననీయండి ఈ రోజు (మార్చి 8) అంతర్జాతీయ సంఘీభావ దినోత్సవం. శ్రామిక మహిళా ఉద్యమం తన బలాన్ని, నిర్మాణాన్ని సమీక్షించు కోవాల్సిన రోజు. అయితే ఇది మహిళలకు మాత్రమే ప్రత్యేకించిన రోజు కాదు. మార్చి 8 అనేది కార్మికులకు, రైతాంగానికి, కార్మికవర్గానికి యావత్‌ ప్రపంచ కార్మిక వర్గానికి చారిత్రాత్మక మైన, మరుపురాని రోజు. 1917లో ఈ రోజునే రష్యాలో మహత్తర ఫిబ్రవరి విప్లవం బద్దల యింది. పీటర్స్‌బర్‌లో శ్రామిక మహిళలు ఈ విప్లవానికి నాంది పలికారు. జారు చక్రవర్తి, అతని సైనికులకు వ్యతిరేకంగా జెండా ఎత్తారు. అందుకే శ్రామిక మహిళలకు ఇది రెండు పండగలు కలిసివచ్చిన సందర్భం. మార్చి 8వ తేదీ శ్రామిక వర్గానికి సార్వ త్రిక సెలవు దినం అయినా మనం దీన్ని మహిళా దినోత్సవం అని ఎందుకు పిలుచుకుంటున్నాం. ప్రత్యేకించి శ్రామిక, రైతాంగ మహిళా సమావే శాలు నిర్వంహించడం మీదే ఎందుకు దృష్టి పెడుతున్నాం. దీనివల్ల మనం కార్మికవర్గ ఐక్యతను గానీ, అంతర్జాతీయ సంఘీభావాన్ని గానీ దెబ్బతీస్తున్నామా? ఈ ప్రశ్నలకు సమాధా నం చెప్పుకోవాలంటే మనం ఒకసారి చరిత్రను తరచి చూసుకోవాలి. ఏ లక్ష్యం కోసం మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామో గుర్తు చేసుకోవాలి.

ఎందుకు, ఎలా..?


పదేళ్ల క్రితం నుండి(1910) మహిళా సమానత్వం గురించి, మగవాళ్ళతోపాటుగా మహిళలకు కూడా రాజకీయ పాలనాధికారం గురించి తీవ్రమైన చర్చ సాగుతోంది. పెట్టుబడి దారీ దేశాలన్నింటా కార్మిక వర్గం శ్రామిక మహిళల హక్కుల గురించి పోరాటాలు నిర్వ హిస్తూ ఉన్నది. కానీ బూర్జువా వర్గం శ్రామిక మహిళలకు హక్కులు ఇవ్వనిరాకరి స్తోంది. కార్మిక వర్గం ఓటింగ్‌ హక్కును విస్తృతం చేయ డం ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కార్మికవర్గం బలపడడానికి, తమ ఆధిపత్యం వదులుకోవడానికీ బూర్జువా వర్గం సిద్ధంగా లేదు. అందుకే బూర్జువా వర్గం ప్రతిదేశంలోనూ మహిళలకు హక్కులు కల్పించే బిల్లులకు చట్ట పరమైన ఆమోదం లభించకుండా ఆటంకాలు కల్పిస్తూనే ఉన్నది.

అమెరికాలో సోషలిస్టులు మహిళలకు ఓటు హక్కు కోసం పట్టుపట్టి పోరాటాలు నిర్వ హించారు. 1909 ఫిబ్రవరి 28న శ్రామిక మహిళలకు రాజకీయ హక్కులు కల్పించాలనే డిమాండ్‌తో అమెరికా అంతటా ప్రదర్శనలు, మీటింగులు జరిగాయి. ఒకరకంగా చెప్పుకో వాలంటే ఇదీ 'మహిళా దినోత్సవమే'. మహిళా దినోత్సవ నిర్వహణకు సంబంధించి చొరవ చేసింది అమెరికన్‌ మహిళా కార్మిక వర్గమే అని చెప్పుకోవచ్చు.

1910లో జరిగిన శ్రామిక మహిళల రెండవ అంతర్జాతీయ సదస్సులో క్లారాజెట్కిన్‌ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం గురించి లేవనెత్తింది. మహిళలకు ఓటింగ్‌ హక్కు సాధించుకోవడం ద్వారా మహిళా ఐక్యతను పెంపొందించుకుని సోషలిజం సాధననను బలోపేతం చేయ్యలనే నినాదంతో ప్రతి దేశంలో ప్రతి ఏడాదీ ఒకే రోజున 'మహిళా దినోత్సవం' నిర్వహించు కోవాలని సదస్సు పిలుపునిచ్చింది.

ఈ కాలంలో మహిళలకు వయోజన ఓటు హక్కు కల్పించడం ద్వారా పార్లమెంటును మరింత ప్రజాస్వామికరించాలనే అంశం కీలక ప్రాధాన్యతను సంతరించుకుంది. మొదటి ప్రపం చ యుద్ధ్దానికంటే ముందుకాలం నుంచే ఒక్క రష్యాలో మినహా అన్ని బూర్జువా దేశాల్లోనూ కార్మికులకు ఓటు హక్కు ఉంది. కేవలం మహిళలు, మతిస్తిమితం లేని వాళ్లను మాత్రమే ఈ హక్కు నుండి మినహాయించారు. అదే సందర్భంలో పెట్టుబడిదారీ విధానం ఎదుర్కొన్న కటువైన వాస్తవ పరిస్థితులు ఏమిటంటే దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ అవస రాలు అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. ఫ్యాక్టరీలలో, వర్క్‌షాపులలో, ఆఫీసులలో పని చేయడానికి మహిళల అవసరం ఏటికేటికీ పెరుగుతూ వచ్చింది. పురుషులతో సమానంగా మహిళలూ పనిచేసి దేశ సంపద పోగు చేయడంలో తమవంత కృషి చేశారు. అయినా మహిళలకు ఓటు హక్కు లేకుండా పోయింది. అయితే యుద్ధానికి ముందు సంవత్సరాల్లో ఆహార ఉత్పత్తుల ధరల విపరీతంగా పెరిగి పోయి ఇంటిపట్టున ప్రశాంతమైన జీవితం గడిపే గృహిణీమణులు కూడా ఇందుకు గల రాజకీయ కారణాలను అర్థం చేసుకుని బూర్జువా ఆర్థిక వ్యవస్థ దోపడిని ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. గృహిణీమణుల తిరుగుబాట్లు, రోడ్లమీదకొచ్చి ప్రదర్శనలు చెయ్యడం, నిరసన తెలపడం నానా టికీ పెరిగాపోయాయి. ఈ నిరసనలు ఒక్కో దేశం నుండి ఇంకో దేశానికి అగ్గిలా రాజుకు న్నాయి. ఆస్ట్రియా, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ వంటి దేశాలన్నింటా ఇలాంటి ఉద్యమాలు నడిచాయి.

మార్కెట్లలో కొట్లమీద పడి ధ్వంసం చేయ డం, వ్యాపారస్తులను చితకబాదడం పరిపాటి అయిపోయింది. అయితే ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రయోజనం లేకుండాపోతుందని, ప్రియం అయిపోయిన ధరలకు మూలకారణం ప్రభు త్వం అనుసరిస్తున్న రాజకీయ విధానాల్లో ఉందని శ్రామిక మహిళలు అర్థం చేసుకు న్నారు. పరిస్థితుల్లో మార్పు రావాలంటే రాజకీ యాల్లో మార్పు తీసుకురావాలనీ, అందుకోసం మహిళలకూ ఓటింగ్‌ హక్కు కల్పించాలనే డిమాండ్‌ ముందుకొచ్చింది. ఈ హక్కు సాధన కోసం ప్రతిదేశంలో విధిగా మహిళా దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళ లందరికీ ఈ హక్కుల సాధన సాధ్యం కావా లంటే ఉమ్మడి లక్ష్యంతో అంతర్జాతీయ సంఘీ భావంతో ఉద్యమాలు నడపాలనీ, ఏటా శ్రామిక మహిళల నిర్మాణ బలాన్ని అంచనా వేసుకుంటూ సోషలిజం సాధన దిశగా ఎలాంటి కార్యక్రమాలు రూపొందించుకోవాలో మహిళా దినోత్సవం రోజున సమీక్షించుకోవాలనీ నిర్ణ యం జరిగింది.

తొలి అంతర్జాతీయ మహిళాదినోత్సవం


సోషిలిస్టు మహిళల రెండవ అంతర్జా తీయ సదస్సు ఇచ్చిన ఈ పిలుపు కాగితాలకే పరిమితం కాలేదు. 1911 మార్చి 19న తొలి అంతర్జాయతీయ మహిళా దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మార్చి 19వ తేదీని ఎంచుకోడానికి ఒక ప్రాముఖ్యత ఉంది. జర్మన్‌ శ్రామిక వర్గానికి ఆరోజుకు ఉన్న ప్రాముఖ్యత రీత్యా మార్చి 19వ తేదీని ఎంచుకుందామని జర్మన్‌ మహిళా ప్రతినిధివర్గం ఆ సదస్సులో సూచించింది. శ్రామిక వర్గ ప్రజల సాయుధ తిరుగుబాటుకు రష్యా రాజు తలొగ్గిన రోజు 1848 మార్చి 19. రాజు ప్రజలకు అనేక వాగ్ధానాలు చేశాడు. మహిళలకు ఓటు హక్కు కల్పిస్తానని కూడా తొలిసారిగా అంగీకరించాడు. అయితే ఆ తరువాత ఈ వాగ్ధానాల్లో అనేకం నిలబెట్టు కోలేదు. అదివేరే సంగతి. జనవరి 11నుండి జర్మనీ, ఆస్ట్రియాలలో మహిళా దినోత్సవం నిర్వహణకు చురుకుగా ఏర్పాట్లు సాగాయి. ఒక భారీ ప్రదర్శన నిర్వ హించాలని నోటిమాటగా ప్రచారం చేశారు. పత్రికులకు ప్రకటనలు ఇచ్చారు. అయితే ఇంకో వారం రోజుల్లో మహిళా దినోత్సవం జరగ నుంది అనగా రెండు పత్రికలు మాత్రం ఈ వార్తతో పాటు కొన్ని వ్యాసాలూ ప్రచురిం చాయి.

'జర్మన్‌ మహిళలకు ఓటుహక్కు', 'ఆస్ట్రి యాలో మహిళా దినోత్సవం', 'మహిళలు- పార్లమెంటు', 'శ్రామిక మహిళలు - మున్సిపల్‌ వ్యవహరాలు', 'గృహిణులకు రాజకీయాలతో పనేంటి' వంటి శీర్షికలతో పత్రికలు నిండి పోయాయి. సమాజంలో, ప్రభుత్వంలో మహి ళా సమానత్వ సాధన అవసరం, సాధ్యా సాధ్యా ల గురించి క్షుణ్ణమైన విశ్లేషణ నడిచింది. దాదాపు అన్ని వ్యాసాల్లో వెలిబుచ్చి అభిప్రయాల సారంశం ఒక్కటే. పార్లమెంట్‌ను మరింత ప్రజాస్వామీకరించాలంటే మహిళలందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పిం చాల్సిందే.

1911 మార్చి 19న తొలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. అంచ నాలకు మించి జయప్రదమైంది ఈ కార్యక్రమం. జర్మనీ, ఆస్ట్రియాలలో శ్రామికమహిళా ప్రదర్శనలు సముద్రంలా పోటెత్తిపోయాయి. చిన్న చిన్న పట్టణాలు, పల్లెల్లో కూడా మహిళా సమావేశాలు జయప్రదంగా జరిగాయి. చాలా చోట్ల జాగాలేక సమావేశానికి వచ్చిన మగ వారిని వెళ్లిపోమ్మని చెప్పాల్సిన పరిస్థితి వచ్చిం దంటే మహిళా దినోత్సవం ఏ మేరకు విజయ వంతమైందో అంచనా వేసుకోవచ్చు.

శ్రామిక మహిళల సమరశీలతికు అద్దం పట్టిన తొలిప్రదర్శన ఇది. మగవాళ్లు ఇంటి పట్టునే ఉండి పిల్లల ఆలనాపాలనా చూసు కున్నారు. అప్పటికే వంటింటికే పరిమితమైన గృహిణులు తొలిసారిగా వీధికెక్కారు. అప్పట్లోనే దాదాపు 30,000 మంది మహిళలు ఆ భారీ ప్రదర్శనలో పాల్గొన్నారు. పోలీసులు వాళ్లు చేపట్టిన బ్యానర్లు లాక్కోవాలని ప్రయత్నించారు. శ్రామిక మహిళలు వాళ్ల ప్రయత్నాలను అడ్డు కున్నారు. తోపులాట జరిగింది. ఇంకాస్త ఉంటే పోలీసులు ఆప్రదర్శనను రక్తపుటేరుల్లో ముంచెత్తే వాళ్లు. కాని పార్లమెంట్‌లో సోషలిస్టు ప్రతినిధు లుగా ఉన్నవాళ్లు జోక్యం చేసుకుని దాన్ని నివారించారు. 1913లో అంతర్జాతీయ మహిళా దినోత్స వాన్ని మార్చి 8వ తేదీకి మార్చారు. అప్పటి నుండి మార్చి 8 మహిళా దినోత్సవంగా, శ్రామిక మహిళల సమరశీలతికు కొండ గుర్తుగా మారింది.

మహిళా దినోత్సవం అవసరం ఉందా..?


అమెరికా, యూరప్‌ దేశాలలో మహిళా దినోత్సవం అద్భుతమైన ఫలితాలు సాధించింది. బూర్జువా పార్లమెంట్లు అప్పటిదాకా కార్మికులకు ఎలాంటి రాయితీలు ఇవ్వడానికి గానీ, మహిళా సమస్యల పట్ల స్పందించడానికి గానీ ఏమ్రాత్రం సిద్ధపడలేదు. ఎందుకంటే వాళ్లకు తక్షణం సోషలిస్టు విప్లవాల నుండి ఎదురయ్యే ప్రమాదం ఏదీ లేదు. అయితే మహిళా దినోత్సవం నిర్వహణ ఒకమేరకు కదలిక సాధించింది. రాజకీయంగా అంత చైతన్యవంతం కాని శ్రామిక మహిళా సోదరీమణుకు ఒక అద్భుతమైన పోరాట రూపాన్ని అందించింది. మహిళా దినోత్సవానికి ఉద్ధేశించిన సమావేశాలు, ప్రదర్శనలు, పోస్టర్లు, కరపత్రాలు, దినపత్రికల పట్ల వారి ఆసక్తి పెరిగింది. రాజకీయంగా బాగా వెనుకబడిన గ్రామీణ ప్రాంత శ్రామిక మహిళల్లో కూడా ఇది చైతన్యం కలిగించింది. 'మా పండగ రోజు' అనే ఉత్సాహం కలిగి సమావేశాలు, ప్రదర్శ నలవైపు పరిగెట్టించింది. ఏటేటా జరిగే ఈ మహిళాదినోత్సవం ప్రభావంతో కార్మిక సంఘాలలో, సోషలిస్టు పార్టీలలో మహిళలు ఎక్కువ ఎక్కువగా వచ్చి చేరసాగారు. వీటి నిర్మాణబలం పెరిగింది. రాజకీయ చైతన్యం అభివృద్ధి అయింది.

మహిళా దినోత్సవం వల్ల ఒనగూడిన మరో ఫలితం ఏమంటే కార్మికుల మధ్య అంత ర్జాతీయ సంఘీభావం పెంపొందింది. వివిధ దేశాలలో ఉన్న పార్టీలు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసే సమావేశాలకు ఇతర దేశాల వక్తలను పిలిచి వారి అనుభ వాలను పంచుకునేవారు. జర్మన్‌ కామ్రేడ్‌లు ఇంగ్లాండ్‌ వెళ్తే, ఇంగ్లాండ్‌ కామ్రేడ్‌లు హాలాండ్‌.. ఇలా వేర్వేరు దేశాలకు వెళ్ళేవారు. కార్మిక వర్గం మధ్య అంతర్జాతీయ సుహృద్భావం బలపడి తద్వారా శ్రామిక వర్గం పోరాటపటిమ మరింత పెంపొందింది. ఇవన్నీ శ్రామిక మహిళా దినోత్సవ సమర శీలత ఫలితాలే. శ్రామిక మహిళల నిర్మాణానికి, వారి చైతన్య స్థాయిని పెంపొందించేందుకు మహిళా దినోత్సవ నిర్వహణ ఎంతగానో ఉపక రించింది. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే కార్మికవర్గం మెరుగైన భవిష్యత్తు కోసం జరిగే పోరాటాలకు ఊతంగా నిలిచింది.

రష్యాలో శ్రామిక మహిళా దినోత్సవం


రష్యాలో 1913లో తొలిసారిగా శ్రామిక మహిళాదినోత్సవం జరిగింది. అప్పట్లో కార్మిక వర్గం, రైతాంగం జారు చక్రవర్తి ఉక్కు పిడికిట నలిగిపోతోంది. అలాంటి నేపథ్యంలో శ్రామిక మహిళా దినోత్సవం జరుపుకోవడంగానీ, ఆ పేరిట బహిరంగంగా ప్రదర్శనలకు దిగడంగానీ ఊహకైనా తట్టని అంశం. అయినా సంఘటిత శ్రామిక మహిళలు మహిళాదినోత్సవాన్ని నిర్వ హించుకున్నారు. కార్మికవర్గం కోసం నడిపిన రెండు పత్రికలలో - బోల్షివిక్‌లు నడిపిన 'ప్రాప్పా', మెన్షవిక్‌లు నడిపిన 'లూక్‌'లలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మీద అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ప్రత్యేక వార్తలు, ఇతర దేశాలలో జరిగిన మహిళా దినోత్సవ చాయా చిత్రాలతో పాటు కామ్రెడ్‌ క్లారాజెట్కిన్‌, బెబెల్‌ వంటి హేమాహేమీల సందేశాలూ ప్రచురించాయి.

సమావేశాలు నిషేధించబడిన ఆ చీకటి రోజుల్లో పెట్రోగ్రాడ్‌లోని 'కాలాషి కోవెన్కీ ఎక్స్ఛేంజ్‌'లో పార్టీ నాయకత్వంలో మహిళా సమస్య మీద బహిరంగ చర్చావేదిక నిర్వహిం చారు. ప్రవేశ రుసుము ఐదు కొపెక్కులుగా నిర్ణయించారు. అది చట్టవ్యతిరేక సమావేశం అయినా హాలు పూర్తిగా నిండిపోయింది. పార్టీ సభ్యులు కొందరు ప్రసంగించారు. నాలుగు గోడల మధ్య పకడ్బంధీగా ఈ సమావేశం నిర్వహించినా, ముగింపుకు వచ్చేసరికి పోలీసు లకు ఉప్పంది జోక్యం చేసుకున్నారు. వక్తలను అనేకమందిని అరెస్టు చేశారు. జారుచక్రవర్తి తీవ్ర నిర్బంధంలో ఉండి కూడా రష్యన్‌ మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో మమేకం కావడానికి ఇలాంటి సాహాసోపేత కార్యక్రమం చేపట్టారు. రష్యాలో పెరుగుతున్న ప్రజా చైతన్యానికి ఈ సమావేశం ఒక ప్రతీక. జారు చక్రవర్తి చెరసాలలు, ఉరికొ య్యలు కార్మికుల పోరాట స్ఫూర్తి ముందు శక్తివిహీనంగా తయారయ్యాయి. 1914లో శ్రామికమహిళా దినోత్సవం ఇంకాస్త మెరుగ్గా జరిగింది. కార్మికులు, వార్తా పత్రికలు ఇది తమ సంబరంగా భావించారు. పోలీసు జోక్యంవల్ల ప్రదర్శన నిర్వహించడం సాధ్యంకాలేదు. శ్రామిక మహిళా దినోత్సవం ఏర్పాట్లతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ జైల్లో పెట్టారు. అందులో కొంతమందిని సైబీరియాకు తరలించారు. శ్రామిక మహిళలకు ఓటు హక్కు కల్పించాలనే నినాదం సహజంగానే రష్యాలో జారు చక్రవర్తి రాజరికాన్ని కూలదోసే బహిరంగ పిలుపుగా మలుపు తీసుకుంది.

సామ్రాజ్యవాద కాలంలో

శ్రామిక మహిళా దినోత్సవం


ఇంతలో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. దేశదేశాల కార్మికవర్గం రక్తపిపాసి యుద్ధ కోరల్లో చిక్కుకుంది. 1915-1916 సంవత్సరాల్లో ఇతర దేశాల్లో శ్రామిక మహిళా దినోత్సవం పేలవంగా జరిగింది. వామపక్ష, సోషలిస్టు భావాలతో ప్రభావితం అయిన రష్యన్‌ మహిళలు మాత్రం బోల్షవిక్‌ పార్టీ పిలుపు మేరకు మార్చి 8 మహిళా దినోత్సవాన్ని యుద్ధా నికి వ్యతిరేకంగా శ్రామిక మహిళా దినంగా మలిచే ప్రయత్నం చేశారు. కానీ జర్మనీ తదితర దేశాల్లో సోషలిస్టుల ముసుగులో ఉన్న విప్లవ ద్రోహులు మహిళా కామ్రెడ్లు చేసే ప్రయత్నాలను సాగనివ్వలేదు. తటస్థ దేశాలలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా సదస్సులకు హాజరు కావడానికి అవసరమైన పాస్‌పోర్టులు జారీ చేయడానికి నిరాకరించారు. మహిళా దినోత్స వాన్ని భగం చేయాలని బూర్జువా పాలకులు ప్రయత్నించి విఫలమయ్యారు. అంతర్జాతీయ సంఘీభావం వెల్లివిరిసింది. 1915లో నార్వేలో మాత్రమే మహిళాదినత్సోవం సంద ర్భంగా ఒక అంతర్జాతీయ ప్రదర్శన జరిగిం ది. దీనికి రష్యా నుండి, ఇతర తటస్థ దేశాల నుండి మహిళా ప్రతినిధులు హాజరయ్యారు. రష్యాలో ఆ ఏడాది మహిళా దినోత్సవం నిర్వహించాలన్న ఊసే తలెత్తలేదు. జారు చక్రవర్తి అధికార మదోన్మత్తతతో, సాయుధ సైనిక పశుబలం అందుకు ఎలాంటి వెసులుబాటూ ఇవ్వలేదు.

ఇంతలో రానేవచ్చింది మహత్తర 1917 వ సంవత్సరం. ఆకలి, ఎముకలు కొరికే చలి, యుద్ధనేర విచారణలు, శిక్షలు.. ఇవన్నీ రష్యా శ్రామిక - రైతాంగ మహిళల ఓర్పును చంపేసాయి. 1917 మార్చిన 8న (రష్యా కాలమాన ప్రకారం ఫిబ్రవరి 23న) శ్రామిక మహిళలు నిర్భయంగా పెట్రోగ్రాడ్‌ వీధులకె క్కారు. వారిలో కొందరు శ్రామికులు, ఇంకొం దరు సైనికుల భార్యలు. 'మా పిల్లలను బతికించుకోవాడానికి ఇంత రొట్టె ఇవ్వండి' 'కందకాల్లో ఉన్న మా భర్తలను వెనక్కి రప్పించండి' అన్న నినాదాలు వెల్లువెత్తాయి. సముద్రపు టలల్లా ఎగసి పడుతున్న ప్రజాగ్ర హాన్ని చూసి జారు చక్రవర్తి రక్షణ దళాలు చేష్టలుడిగి మిన్నకుండి పోయాయి. మహిళల మీద తమ ప్రతాపం చూపించడానికి ఏమా త్రం సాహసించలేకపోయాయి. ఆ రోజు చారిత్రాత్మక దినంగా మిగిలి పోయింది రష్యా చరిత్రలో. రష్యన్‌ మహిళలు శ్రామిక వర్గ విప్లవ దివిటీని చేతబట్టి పాడు ప్రపంచానికి ఒక మూల నిప్పుబెట్టారు. ఫిబ్రవరి విప్లవానికి నాంది ఈ శ్రామిక మహిళా దినోత్సవ నిర్వహణే.

సమరానికి 'సై'

వందేళ్ల క్రితం(1910) మహిళలకు రాజకీయ సమానత్వ కావాలని, సోషలిజాన్ని సాధించాలనే లక్ష్యంతో శ్రామిక మహిళా దినోత్సవం రష్యాలో మనం జరుపుకున్నాం. ఈ లక్ష్యాన్ని సాధించుకున్నాం కూడా. సోషలిష్టు రష్యాలో సార్వత్రిక వయోజన ఓటింగుహక్కు, ఇతర పౌరహక్కుల కోసం శ్రామిక- రైతాంగ మహిళలు పోరాడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ హక్కులను సోషలిస్టు వ్యవస్థ వారికి కట్టబెట్టింది. పురుషులతో సమానంగా స్త్రీలకు అన్ని హక్కులూ దక్కాయి. జీవితాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకునే అవకాశాలు మహిళలకు పుష్కలంగా లభించాయి. కేవలం ఓటుహక్కే కాకుండా సమిష్టి క్షేత్రాల్లో, ఉమ్మడి సంస్థలలో మహిళలకు భాగస్వామ్యం దక్కింది.

హక్కులు సాధించుకోవడంతోనే మనం తృప్తి పడకూడదు. ఆ హక్కులను ఎలా ఉప యోగ పెట్టుకోవాలనే మెళకువ సంపాదించు కోవాలి. ఉదహారణకు ఓటు హక్కునే తీసుకుందాం. ఆ ఓటు హక్కును స్వీయ ప్రయోజ నాలకు, కార్మికవర్గ శ్రేయస్సుకు, రాజ్య ప్రయోజనాలకు అనుకూలంగా ఎలా ఉపయో గించుకోవాలో అర్థం చేసుకుంటేనే ఆ హక్కు మన చేతిలో వజ్రాయుధంగా మారుతుంది.

సోవియట్‌లో కార్మికవర్గం అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. అయితే మన జీవితాల్లో స్వల్పకాలంలోనే మౌలికమైన మార్పులు ఇంకా రాలేదు. మన సమాజంయొక్క అణిచివేత స్వభావం చీకటికోణాలు ఇంకా మనల్ని వెన్నంటి వస్తూనే ఉన్నాయి. దీనికి తోడు చుట్టూ ఉన్న ప్రపంచం అలానే ఉంది. ఒక్క రష్యాలో మాత్రమే ఇందుకు భిన్నంగా కమ్యూనిస్టు సమాజ స్థాపన లక్ష్యంగా కృషి జరుగుతోంది. శ్రామిక మహిళల మీద కుటుంబ బంధనాలు, ఇంటి పనిభారం, వ్యభిచారం వంటి ప్రభావాలు ఇంకా బలంగానే ఉన్నాయి. ఇవన్నీ కేవలం చట్టాలు చేసినంతమాత్రన తొలగిపోవు. శ్రామిక రైతాంగ మహిళలు ఉమ్మడిగా తమ శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి పై బంధనాల నుండి విముక్తికోసం కృషిచేస్తే తప్ప రష్యాలో కమ్యూనిస్టు వ్యవస్థ స్థాపన సాకారం కాదు. ఈ క్రమాన్ని వేగవంతం చేయాలంటే ముందు కుప్పకూలిన రష్యన్‌ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవాలి. అందుకు మనం రెండు తక్షణ కర్తవ్యాలు నిర్దేశించుకోవాలి. మొదటగా రాజకీయంగా చైతన్యవంతమైన కార్మికవర్గంతో బలమైన నిర్మాణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. రవాణా వ్యవస్థను పునరు ద్ధరించుకోవాలి. మన శ్రామిక సైన్యం తలుచు కోవాలేగాని త్వరలోనే మనం ఆవిరి ఇంజన్‌లు తయారు చేయగలం. రైల్వే వ్యవస్థనూ సరిగా పనిచేయించగలం. తద్వారా ఇవాళ శ్రామిక ప్రజాజీవనానికి కావల్సిన ఆహారం, వంటచెరుకు సమకూరుతుంది. రవాణా వ్యవస్థను మళ్లీ గాడిన పెడితే కమ్యూనిస్టు విజయం వేగవంతమవు తుంది.

కమ్యూనిజం వర్దిల్లుతేనే మహిళలకు మౌలికమైన సమానత్వం లభిస్తుంది. అందుకే ఈ యేడాది మనం జరుపుకోబోయే శ్రామిక మహిళాదినోత్సవం సందేశం ఎలా ఉండాలంటే శ్రామిక రైతాంగ మహిళలు తల్లులు, చెల్లెళ్లు, గృహిణులు అందరూ ఏకతాటిపై రైల్వే వ్యవస్థ పునర్నిర్మాణానికి కృషి చేస్తున్న శ్రామిక వర్గానికి అన్ని విధాలా అండదండలుగా నిలవాలి. ఆహారం, వంటచెరుకు, ముడిఖనిజాల సాధన కోసం జరిగే కృషిని జయప్రదం చేయాలి. గతే డాది శ్రామిక మహిళాదినోత్సవం సందర్భంగా ఎర్రదండుకు సకల విజయాలు కలగాలి అన్న నినాదం తీసుకున్నాము. ఎర్రదండు విజయానికి మహిళాలోకం అందించిన తోడ్పాటు అంతా ఇంతా కాదు. అలానే ఈ యేడాది అదే స్ఫూర్తితో శ్రామిక దండు తమ లక్ష్యాన్ని నెరవేర్చడానికి కావల్సిన అండదండలు అందించాలి. ఎర్రదండు నిర్మాణం క్రమశిక్షణగల సంస్థ. త్యాగాలకు వెరువని సంస్థ. అందుకే శత్రువుమీద విజయం సాధించగల్గింది. గాడితప్పిన రవాణా, ఆర్థిక వ్యవస్థలు, ఆకలి, ఆరోగ్యం ఇవే మనముందున్న అంతర్గత శత్రువులు. వీటిపై పైచేయి సాధించ డానికి కష్టపడి పనిచేసే స్వీయక్రమశిక్షణ, త్యాగబుద్ది కలిగిన శ్రామికదండు అవసరం ఎంతైనా ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ దండులో చేరండి. విజయం సాధించడానికి మీలో ప్రతి ఒక్కరూ వీరికి తోడ్పడండి. శ్రామిక మహిళాదినోత్సవం నూతన కర్తవ్యాలు మహాత్తర అక్టోబర్‌ విప్లవం మహిళలకు పురుషులతోపాటు సమానత్వం ఇచ్చింది. పౌరహక్కులూ ఇచ్చింది.

నిన్నమొన్నటిదాక రష్యా శ్రామిక మహిళలు తీవ్రమైన అణిచివేతకు గురైన దురదృష్టవంతులు. కాని ఇవాళ మిగతా ప్రపంచ దేశాల మహిళల ముందు గర్వంగా తలెత్తుకునే స్థితిలో ఉన్నారు. అంతేకాదు మహిళలు రాజకీయ సమానత్వం సాధించాలంటే రష్యాలో మాదిరి శ్రామికవర్గ నియంతృత్వం తప్ప వేరే మార్గం లేదని పద నిర్దేశం చేశారు. ఇప్పటికీ పెట్టుబడిదారీ దేశాల్లో మహిళల పరిస్థితి క్లిష్టంగానే ఉంది. పనిబారం బండెడు, సౌకర్యాలు అరకొర. అప్పులు నామ్‌కే వాస్తే తీరుగా ఉంది. ఇలా మహిళల పరిస్థితి, ఈ దేశాల్లో శ్రామిక మహిళల పరిస్థితి బలహీ నంగా ఉంది. అయితే నార్వే, ఆస్ట్రేలియా, ఫిన్‌లాండ్‌ వంటి దేశాల్లో ఉత్తర అమెరికా ఖండంలోని కొన్ని రాష్ట్రాల్లో మొదటి ప్రపంచ యుద్దానికాన్నా ముందునుండే మహిళలు పౌరహక్కులు సాధించుకున్న మాట వాస్తవమే. జర్మనీలో టైజర్‌ చక్రవర్తి రాజరికాన్ని కూలదోసి బూర్జువా రాజ్యాన్ని నిలబెట్టారు. రాజకీయ వాదులు నడిపిన ఈ ప్రభుత్వంలో పార్లమెంటుకు 36 మంది మహిళలు ఎంపిక య్యారు. వారిలో ఒక్క కమ్యూనిస్టూ లేరు. అలాగే 1919లో ఇంగ్లాండ్‌లో తొలిసారిగా ఒక మహిళా ప్రతినిధి పార్లమెంటుకు ఎన్నికైంది. ఆమెను అమ్మగారూ అనేవారు. మన అమ్మలాం టిది కాదు ఆవిడ నిజంగా అమ్మగారే. కులీన కుటుంబం నుండి వచ్చిన ఒక మహిళా రాజ వంశస్తురాలు. ఫ్రాన్స్‌లో మహిళలకు ఓటింగ్‌ హక్కు కల్పించాలనే అంశంమీద చర్చ నడుస్తూనే ఉంది. అయితే భూర్జువాపార్లమెంటు చట్టంలో శ్రామిక మహిళలకు ఏం హక్కులు ఒనగూరు తాయి. అధికారం అంతా పెట్టుబడిదారీ చేతుల్లో, సంపద యజమానుల చేతుల్లో ఉన్నం తకాలం శ్రామిక మహిళకు మిగిలేది ఇంటా బయటా సాంప్రదాయభానిసత్వమే తప్ప రాజకీయ హక్కులు నామమాత్రంగానే అలంకార ప్రాయంగానే మిగులుతాయి.

ఒక పక్కన బోల్షివిక్‌ విప్లవం బూచీ పొంచి ఉంది. కాబట్టి శ్రామిక మహిళలకు ఓటు హక్కును నగారాగా అందించాలని ఫ్రాన్స్‌ భూర్జువావర్గం పాచిక వేసింది. కాని ఘనమైన భూర్జువా అయ్యలు 'మీరు ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. మహత్తర అక్టోబర్‌ విప్లవం అనుభవం నుండి ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌ తదితర దేశాల్లోని శ్రామిక మహిళలకు ఒక విషయం స్పష్టమైంది. శ్రామికవర్గ నియంతృత్వం ద్వారా సోవియట్‌లో చేపట్టిన అధికారం ద్వారా మాత్రమే మహిళలకు సమానత్వం సిద్ధిస్తుందని అర్ధం చేసుకున్నారు. శతాబ్దాల తరబడి దాస్యశృంఖ లాలలో చిక్కుకొని బనాయించిన దోపిడీ అణిచివేతలు స్వస్తిపలకడం ఒక్క కమ్యూనిజం తోనే సాధ్యమని అవగాహనకు వచ్చారు. ఒక పక్కన భూర్జువాపార్లమెంటులో మహిళలు ఓటుహక్కుకోసం పోరాడుతున్న నేపథ్యంలో జరుపుకోవాల్సిన శ్రామిక మహిళాదినోత్సవం సందర్భంగా మనం మన కర్తవ్యాన్ని ఎంచు కోవాలి. మూడవ కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ ఇచ్చిన నినాదాల వెనుక అత్యధిక శ్రామిక మహిళావర్గాన్ని సమీకరించాలి. భూర్జువాపార్ల మెంటులో భాగస్వామ్యానికి బదులు కమ్యూనిస్టు రష్యాని ఆదర్శంగా తీసుకోమని చెప్పాలి. ఈ ప్రపంచాన్ని దోచుకుతింటున్న పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా విశాల ప్రతిఘటనా వేదికలో దేశదేశాల శ్రామిక మహిళలు భాగస్వాములు కావాలి. బూర్జువాపార్లమెంటరీ తత్వాన్ని తెగనాడాలి. సోవియట్‌లో అధికారాన్ని స్వాగతించాలి. శ్రామికవర్గం ఎదుర్కొంటున్న అసమానతలు తొలగించాలి. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం విజయం సాధించేందుకు కంకణ బద్ధులు కావాలి. నూతన ప్రపంచ క్రమం, అది పెట్టుబడీదారి దేశాలు చెప్పుకుంటున్న వ్యవస్థలో మహిళల స్థితిగతులు ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదనే వాస్తవాన్ని ఆ దేశాల్లోని మహిళావర్గం గుర్తించింది. పెట్టుబడీదారి విధానాన్ని కూలదోసి కమ్యూనిజాన్ని స్థాపించ డం ఒక్కటే సమస్యకు పరిష్కారం. కేవలం ఓటు హక్కుకోసం సీట్లకోసమే కాకుండా మానవాళి సంపూర్ణ విముక్తికోసం మహిళా సమానత్వం కోసం ఇకమీదట యుద్ధం జరగాలి. ఈ యుద్ధంలో మహిళలు గెలవాలి. అలా గెలవాలంటే కమ్యూనిజం తప్ప వేరే మార్గం లేదు.

ప్రపంచపెట్టుబడిదారీ విధానం నశించాలి!

బూర్జువా ప్రపంచ సాంప్రదాయాలైన అస మానతలు, హక్కుల లేమి తొలగిపోవాలి!!

ప్రపంచశ్రామిక మహిళల్లారా ఏకం కండి!!!

శ్రామికవర్గ నియంతృత్వంలో శ్రేయోరాజ్య స్థాపనకు భుజం భుజం కలపండి!!!!
సేకరణ : రమణి
Loading...